తీవ్ర చమురు కొరతతో ఇబ్బందిపడుతున్న లంకను ఆదుకునేందుకు సుమారు 38 వేల మెట్రిక్ టన్నుల పెట్రోలియం ఉత్పత్తులను అత్యవసర సాయం కింద భారత్ సరఫరా చేసింది. భారత్ పంపిన ఈ భారీ నిల్వలలో 20 వేల మెట్రిక్ టన్నుల డీజిల్, 18 వేల మెట్రిక్ టన్నుల పెట్రోల్ ఉన్నాయి. ఈ ఇంధన నౌకలు ఇప్పటికే కొలంబో ఓడరేవుకు చేరుకున్నట్లు భారత హైకమిషన్ వెల్లడించింది. ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోడి, శ్రీలంక అధ్యక్షుడు అనూర కుమార దిసనాయకే మధ్య జరిగిన ఫోన్ సంభాషణ తర్వాత ఈ సహాయం వేగవంతమైంది. సంక్షోభ సమయంలో అండగా నిలిచినందుకు శ్రీలంక ప్రభుత్వం, అక్కడి ప్రజలు భారత్కు ధన్యవాదాలు తెలిపారు. శ్రీలంక ప్రతిపక్ష నేత సజిత్ ప్రేమదాస ఎక్స్ (ట్విట్టర్) వేదికగా భారత్ చేసిన ఈ ఉదారమైన సాయాన్ని కొనియాడారు.
0 Comments