ముంబై,ములుంద్ పశ్చిమలోని జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ సమీపంలో మెట్రో సబ్ వే పిల్లర్ కూలిపోయిందని బీఎంసీ తెలిపింది. నిర్మాణ సమయంలో సిమెంట్ మెట్రో పిల్లర్ భాగం విరిగి ఆటోరిక్షాపై పడిందని.. ప్రమాదం జరిగిన వెంటనే ముంబై అగ్నిమాపక దళం, పోలీసులు, మెట్రో సిబ్బంది, వార్డ్ సిబ్బంది, 108 అంబులెన్స్ సర్వీస్ సంఘటనా స్థలానికి చేరుకున్నాయని వెల్లడించింది. ఆటోరిక్షాలో ఉన్న నలుగురు వ్యక్తులు గాయపడినట్లు తెలుస్తోంది.
0 Comments