Ad Code

ఎనిమిది కొత్త బైక్ లను మార్కెట్లోకి తీసుకురానున్న బజాజ్ ఆటో


జాజ్ ఆటో వచ్చే నాలుగైదు నెలల్లో ఎనిమిది కొత్త బైక్ లను మార్కెట్లోకి తీసుకురానున్నది. ఇందులో కొత్త మోడళ్లతో పాటు అప్డేటెడ్ వెర్షన్లు, కొత్త వేరియంట్లు కూడా ఉండనున్నాయి. ఇందులో ముఖ్యంగా కంపెనీ దృష్టి మొత్తం పల్సర్ సిరీస్‌పై ఉన్నట్లు సమాచారం. గత దీపావళి తర్వాత బజాజ్ ఇప్పటికే పల్సర్ 125, పల్సర్ 150 మోడళ్లను అప్‌డేట్లతో విడుదల చేసింది. ఇక నుంచి ప్రతి నెలకు సుమారు రెండు లాంచ్‌ లతో పూర్తి స్థాయి రిఫ్రెష్ లైనప్‌ను అందించాలనే లక్ష్యంతో కంపెనీ దూకుడుగా వ్యవజరించనుంది. ముఖ్యంగా 150cc, అంతకంటే ఎక్కువ సెగ్మెంట్‌లో పల్సర్ బ్రాండ్ బలాన్ని మరింత కొనసాగించడం ఈ వ్యూహం ప్రధాన ఉద్దేశం. కంపెనీ ప్రణాళికల్లో భాగంగా పల్సర్ 220F, పల్సర్ 150, పల్సర్ 125 వంటి మోడళ్లకు మరిన్ని అప్డేట్లు రానున్నట్లు సమాచారం. అదేవిధంగా పల్సర్‌ కు తక్కువ సెగ్మెంట్‌ గా ఉండేలా ప్రత్యేక 125cc బ్రాండ్‌ను రూపొందించే ఆలోచనలో కూడా బజాజ్ ఉంది. ఇది కొత్త వినియోగదారులను ఆకర్షించే ఎంట్రీ-లెవల్ ఆప్షన్‌గా ఉండనుంది. అలాగే డోమినార్ (Dominar) సిరీస్‌ను కూడా మరింత విస్తరించాలనే ప్రణాళిక కంపెనీకి ఉంది. ముఖ్యంగా మెక్సికో వంటి ఎగుమతి మార్కెట్లపై దృష్టి పెట్టనుంది. అలాగే డ్యూయల్-స్పోర్ట్, ఆఫ్-రోడ్ మోటార్‌సైకిళ్లను కూడా అభివృద్ధి చేస్తోంది.

Post a Comment

0 Comments

Close Menu