Ad Code

ఒక్కరోజే రూ. 8 లక్షల కోట్ల హాం ఫట్ : భారీ నష్టాల్లో ముగిసిన సూచీలు


న్వెస్టర్లు అప్రమత్తత వ్యవహరించడంతో ఈరోజు సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. దీంతో ఇన్వెస్టర్లకు ఒక్కరోజే రూ. 8 లక్షల కోట్ల నష్టం వచ్చింది. సెన్సెక్స్ సూచీ ఓ దశలో 800 పాయింట్ల మేర నష్టపోయింది. నిఫ్టీ 50 ఇండెక్స్ మళ్లీ 26 వేల దిగువకు పడిపోయింది. బీఎస్ఈలో నమోదైన కంపెనీల విలువ రూ. 480 లక్షల కోట్ల నుంచి రూ. 472 లక్షల కోట్లకు పడిపోయింది. సెన్సెక్స్ సూచీ ఈ రోజు ఉదయం 84,877 పాయింట్ల వద్ద నష్టాల్లోనే ట్రేడింగ్ మొదలు పెట్టింది. రోజు మొత్తం అమ్మకాల ఒత్తిడితో నష్టాల్లోనే కొనసాగింది. ఇంట్రాడేలో 84,110 వద్ద కనిష్ఠాన్ని తాకి చివరకు 780 పాయింట్ల నష్టంతో 84,180 వద్ద ముగిసింది. నిఫ్టీ 264 పాయింట్ల నష్టంతో 25,876 వద్ద ముగిసింది. భారత్- అమెరికా మధ్య వాణిజ్యంపై సందిగ్ధత నెలకొంది. రష్యా నుంచి చమురు దిగుమతులు ఆపకపోతే 500 శాతం సుంకాలు విధిస్తామని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించడం దేశీయ స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపించింది. రష్యా చమురు దిగుమతులను కట్టడి చేసేందుకు 500 శాతం సుంకాలు విధించే బిల్లుకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగారు. అలాగే విదేశీ పెట్టుబడిదారులు సైతం భారీగా అమ్మకాలు చేపట్టడం ప్రతికూలంగా మారింది.

Post a Comment

0 Comments

Close Menu