తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ తలుపులు చంద్ర గ్రహణం కారణంగా మార్చి 3వ తేదీన 10 గంటలకు పైగా మూసివేయనున్నట్లు తెలిపింది. మధ్యాహ్నం 3:20 నుండి సాయంత్రం 6:47 వరకు గ్రహణం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే ఆలయాన్ని మూసి వేస్తున్నట్లు టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. గ్రహణ మాసానికి ఆరు గంటల ముందు ఆలయ తలుపులు మూసివేయడం ఆచారం. ఈ క్రమంలోనే మార్చి 03న ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 7:30 గంటల వరకు తిరుమల ఆలయ తలుపులు మూసివేయనున్నట్లు టీటీడీ పేర్కొంది. మార్చి 03న రాత్రి 8:30 గంటల తర్వాత శుద్ధి, ఇతర శుద్ధి కర్మల తర్వాత భక్తులను దర్శనానికి అనుమతిస్తామని అధికారులు తెలిపారు. చంద్రగ్రహణం కారణంగా అష్టదళ పాదపద్మారాధన సేవ, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, అర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలకర సేవను తిరుమల తిరుమల దేవస్థానం రద్దు చేసింది.
0 Comments