ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా వెన్నెలవలస గ్రామంలో థర్మల్ పవన్ ప్లాంట్ నిర్మాణంపై ఎమ్మెల్యే రవికుమార్ను గ్రామస్తులు నిలదీశారు. తమ గ్రామంలో ఎలాంటి థర్మల్ ప్లాంట్ నిర్మాణం చేపట్టొద్దని నిరసన తెలిపారు. థర్మల్ ప్లాంట్ నిర్మిస్తున్నారని ఎమ్మెల్యేను ప్రశ్నించడంతో సిబ్బంది గిరిజనులను అడ్డుకుని పక్కకు తీసుకెళ్లారు. దీంతో పోలీసులకు, గిరిజనులకు మధ్య స్వల్ప తోపులాట జరిగింది. స్పందించిన ఎమ్మెల్యే కూన రవికుమార్ గిరిజనుల దగ్గరకు వెళ్లి థర్మల్ ప్లాంట్ వస్తున్నట్టు ఆధారాలు ఉన్నాయా ? అని ప్రశ్నించారు. కొందరు దుష్ప్రాచారం చేస్తున్నారని, వాటిని నమ్మొద్దని ఎమ్మెల్యే సూచించారు. ఒకవేళ అలాంటి ప్రతిపాదనలు ఉంటే మీ అభిప్రాయం తీసుకున్న తర్వాతనే నిర్మాణాలు చేపడ్తామన్నారు.
0 Comments