హైదరాబాద్, వరంగల్ అంతటా కనెక్టివిటీని మరింత వేగవంతం చేయడానికి ప్రత్యేక హై-స్పీడ్ బ్రాడ్బ్యాండ్ ఆఫర్లను యాక్ట్ ఫైబర్ నెట్ ప్రకటించింది. రూ.549 నెలకు ప్రారంభమయ్యే ఈ ఆఫర్లతో, కస్టమర్లు దీర్ఘకాలిక ప్లాన్లపై ప్రత్యేక రాయితీలను పొందవచ్చు. ఇవి ఏఐ ఆధారిత స్మార్ట్ వైఫై సేవలను గృహాలు, వ్యాపారాలకు ప్రయోజనకరం చేయడం లక్ష్యంగా రూపొందించబడ్డాయి. 50 ఎంబీపీఎస్, 100 ఎంబీపీఎస్ వేగం కలిగిన 6 నెలల ప్లాన్లపై 5% తగ్గింపు, 50 ఎంబీపీఎస్, 100 ఎంబీపీఎస్ వేగం కలిగిన 12 నెలల ప్లాన్లపై 10% తగ్గింపు, 200 ఎంబీపీఎస్ లేదా అంతకంటే ఎక్కువ వేగం కలిగిన 12 నెలల ప్లాన్లపై 5% తగ్గింపు అందిస్తోంది. యాక్ట్ ఫైబర్ నెట్ ఏఐ ఆధారిత స్మార్ట్ వైఫై సాంకేతికత, విస్తృత కవరేజ్, అనేక పరికరాలకు నిరంతర కనెక్టివిటీని అందిస్తూ గృహాలు, వ్యాపారాల కోసం మరింత స్మార్ట్, విశ్వసనీయమైన ఇంటర్నెట్ అనుభూతిని కల్పిస్తుందని సంస్థ ప్రకటించింది.
0 Comments