Ad Code

భక్తులతో కిటకిటలాడుతున్న తిరుమల : సర్వదర్శనానికి 30 గంటలు


తి­రు­మలలో శ్రీ­ని­వా­సు­డి దర్శ­నా­ని­కి భక్తు­లు భా­రీ­గా తరలి వస్తు­న్నా­రు. వరుస సె­ల­వు­లు కా­ర­ణం­గా స్వా­మి­ని దర్శిం­చు­కో­వ­డా­ని­కి వచ్చిన భక్తు­ల­తో ఏడు కొం­డు­లు జన­సం­ద్రం­తో నిం­డి­పో­యా­యి. ఈ క్ర­మం­లో టీ­టీ­డీ వి­స్తృత ఏర్పా­ట్లు చే­సి­న­ప్ప­టి­కీ గం­ద­ర­గో­ళం ఏర్ప­డిం­ది. అలి­పి­రి భూ­దే­వీ కాం­ప్లె­క్స్‌­లో భక్తుల మధ్య తో­పు­లాట చోటు చే­సు­కుం­ది. దర్శన టి­కె­ట్లు తీ­సు­కు­నే టైం­లో గం­ద­ర­గో­ళం ఏర్ప­డిం­ది. దీం­తో ఏర్పా­ట్లు సరి­గా లే­వ­ని భక్తు­లు ఆరో­పిం­చా­రు. టి­కె­ట్ కౌం­ట­ర్లు పెం­చా­ల­ని డి­మాం­డ్ చే­శా­రు. సా­మా­న్య భక్తు­ల­కు అధిక ప్రా­ధా­న్యత ఇస్తా­మం­టు­న్న టీ­టీ­డీ సి­ప­డా కౌం­ట­ర్‌­లు కూడా ఏర్పా­టు చే­య­డం లేదా అని ప్ర­శ్ని­స్తు­న్నా­రు. దీ­ని­పై టీ­టీ­డీ సీ­వీ­ఎ­స్వో ము­ర­ళీ­కృ­ష్ణ మా­ట్లా­డు­తూ సె­ల­వుల కా­ర­ణం­గా తి­రు­ప­తి­లో­ని భూ­దే­వి కాం­ప్లె­క్స్ వద్ద భక్తుల రద్దీ భా­రీ­గా పె­రి­గిం­ద­న్నా­రు. ఎస్ఎస్డీ టో­కె­న్లు పూ­ర్తి­కా­వ­డం­తో ది­వ్య­ద­ర్శ­నం టో­కె­న్ల కోసం భక్తు­లు కౌం­ట­ర్ల వద్ద­కు చే­రు­కు­న్నా­ర­ని తె­లి­పా­రు. పరి­స్థి­తి­ని వెం­ట­నే గమ­నిం­చిన వి­జి­లె­న్స్, సె­క్యూ­రి­టీ, పో­లీ­సు సి­బ్బం­ది భక్తు­ల­ను క్ర­మ­బ­ద్ధీ­క­రిం­చా­ర­ని వి­వ­రిం­చా­రు. " దర్శన టో­కె­న్లు పూ­ర్త­య్యా­య­ని భక్తు­ల­కు స్ప­ష్టం­గా తె­లి­య­జే­శాం. అక్కడ ఎలాం­టి లా­ఠీ­చా­ర్జ్ గానీ, తొ­క్కి­స­లాట గానీ జర­గ­లే­దు. పరి­స్థి­తి పూ­ర్తి­గా అదు­పు­లో­నే ఉంది. భక్తు­లు సి­బ్బం­ది సూ­చ­న­లు పా­టిం­చా­ల­ని, సో­ష­ల్ మీ­డి­యా­లో వచ్చే తప్పు­డు వదం­తు­ల­ను నమ్మ­వ­ద్ద­ని కో­రు­తు­న్నాం. వదం­తు­లు వ్యా­ప్తి చే­సే­వా­రి­పై చట్ట­ప­ర­మైన చర్య­లు తీ­సు­కుం­టాం" అని హె­చ్చ­రిం­చా­రు. తిరుమలలో భారీగా భక్తులు ఉండడంతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

Post a Comment

0 Comments

Close Menu