Ad Code

అమరావతిలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి 13 అడుగుల కాంస్య విగ్రహం ఆవిష్కరణ !


ఆంధ్రప్రదేశ్ లోని అమరావతిలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి శత జయంతిని పురస్కరించుకొని ఆయన స్మారకార్థం 13 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు మరియు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పాల్గొని విగ్రహాన్ని ఆవిష్కరించారు. సాంస్కృతికంగా, రాజకీయంగా గుర్తింపు పొందిన ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాసవర్మ, భాజపా ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తదితరులు హాజరై పాల్గొన్నారు. వెంకటపాలెంలో ఏర్పాటు చేసిన ఈ విగ్రహం వాజ్‌పేయీకి నివాళి అర్పిస్తూ, ప్రజలకు ఆయన జీవితాన్ని గుర్తు చేయడానికి ప్రతీకగా నిలుస్తుంది.

Post a Comment

0 Comments

Close Menu