ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం బందపల్లి బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో హెచ్ఎంగా పనిచేస్తున్న సుజాత విద్యార్ధులతో కాళ్లు పట్టించుకున్న వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై స్పందించిన ప్రభుత్వం ప్రధానోపాధ్యాయురాలిపై వేటు వేసింది. ఉపాధ్యాయురాలు ఎంతో హుందాగా సెల్ ఫోన్లో మాట్లాడుతూ కుర్చీలో కూర్చొని ఉండగా, ఇద్దరు విద్యార్థినులు ఆ హెచ్ఎం కాళ్లు నొక్కుతున్న చిత్రాన్ని చూసిన జనాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి ఆమెపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైరల్గా మారిన ఆ ఫొటోపై సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేగింది. ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న విద్యాశాఖ విద్యార్థినులతో కాళ్లు పట్టించుకున్న ఉపాధ్యాయురాలిని సస్పెండ్ చేసింది. సుజాత విద్యార్ధులతో కాళ్లు పట్టించుకున్నట్లు ఉన్న ఫొటోలో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో. హెచ్ఎం సుజాతపై విచారణకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సుజాతపై విచారణ పూర్తయ్యే వరకూ ఆమెపై సస్పెన్షన్ విధిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
0 Comments