దేశీయ మార్కెట్లో హోండా కార్స్ ఇండియా సరికొత్త ఎస్యూవీ 'ఎలివేట్ ఏడీవీ' ని ప్రవేశపెట్టింది. యువతను ఆకట్టుకునేలా దీనికి అనేక అధునాతన ఫీచర్లు జోడించినట్టు మార్కెటింగ్ అండ్ సేల్స్ వైస్ ప్రెసిడెంట్ కునాల్ బెహల్ చెప్పారు. రెండు వెర్షన్లలో లభించే ఈ కారు ఎక్స్ షోరూమ్ ధర హైదరాబాద్లో రూ.15.20 లక్షల నుంచి రూ.16,66,800 వరకు ఉంది. రెండు తెలుగు రాష్ట్రాలు తమకు అత్యంత కీలక మార్కెట్లని తెలిపారు. తమ మొత్తం అమ్మకాల్లో ఈ రెండు రాష్ట్రాల వాటా ఏడు శాతం వరకు ఉంటుందన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం అల్ఫా ఈవీ కారును భారత్లోనూ విడుదల చేయబోతున్నట్టు వెల్లడించారు. ఇందుకోసం ఇప్పటికే చార్జింగ్ పాయింట్ ఆపరేటర్లతో చర్చిస్తున్నట్టు కునాల్ చెప్పారు. ఈ ఈవీ కారును భారత్లో తయారుచేసి జపాన్తో సహా అనేక దేశాలకు ఎగుమతి చేయబోతున్నట్టు తెలిపారు.
0 Comments