Ad Code

ఉద్యోగులకు వాలంటరీ ఎగ్జిట్ ప్యాకేజీలను ఆఫర్ చేసిన యూట్యూబ్


యూట్యూబ్ కంపెనీ విడిచి వెళ్లే ఉద్యోగులకు వాలంటరీ ఎగ్జిట్ ప్యాకేజీలను ఆఫర్ చేసింది. కృత్రిమ మేథ దూసుకు వస్తున్న నేపధ్యంలో యూ ట్యూబ్ భారీ మార్పులకు శ్రీకారం చుట్టబోతోంది. ఈ క్రమంలో ఆ కంపెనీ సీఈఓ నెల్ మోహన్ ఈ మేరకు ప్రకటన చేసారు. కృత్రిమ మేథను ఉపయోగించుకునేందుకు మార్పులు సహజమని ఆయన వెల్లడించారు. ఏఐ దెబ్బకి ఎవరి ఉద్యోగం ఎప్పుడు ఊడిపోతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. ఇది మరీ ముఖ్యంగా ఐటీ పరిశ్రమలో ఎక్కువగా కనిపిస్తోంది. ఇప్పటికే దిగ్గజ కంపెనీలైన గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ లేఆఫ్‌లు సాగుతూనే వున్నాయి. ఫలితంగా సుమారు 80,000 మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయినట్లు గణాంకాలు చెబుతున్నాయి.

Post a Comment

0 Comments

Close Menu