న్యూఢిల్లీ ఎయిర్పోర్ట్లో విధులు నిర్వహిస్తున్న సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) జవాన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. టాయిలెట్లోకి వెళ్లి సర్వీస్ గన్తో కాల్చుకుని మరణించాడు. ఆ జవాన్ ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడో అన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గుజరాత్లోని సూరత్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఈ సంఘటన జరిగింది. జైపూర్కు చెందిన 32 ఏళ్ల కిషన్ సింగ్ సీఐఎస్ఎఫ్ జవాన్గా విధులు నిర్వహిస్తున్నాడు. శనివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఎయిర్పోర్ట్లోని టాయిలెట్కు వెళ్లాడు. సర్వీస్ రైఫిల్తో పొట్టలో కాల్చుకున్నాడు. గమనించిన సీఐఎస్ఎఫ్ సిబ్బంది, కిషన్ సింగ్ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే ఆ జవాన్ అప్పటికే మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు. పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేశారు.
0 Comments