తమిళనాడు రాష్ట్రం పట్టుకొట్టాయ్స్లో ఓ వ్యక్తి రోడ్డు దాటే క్రమంలో ఓ బస్సు స్పీడ్గా వచ్చింది. దీంతో అతను కాస్త స్లో అయ్యాడు. రెప్పపాటు కాలంలో ఆ బస్సును మరో బస్సు ఓవర్ టేక్ చేయబోయింది. ఇంకేముంది ఆ వ్యక్తి రెండు బస్సుల మధ్య ఇరుక్కుపోయారు. ఈ ఘటన చూసిన వారంతా ఇక అతని పని అయిపోయిందనుకున్నారు. కానీ రెండు బస్సులు కాస్త దూరం జరగడంతో అతను కిందపడిపోయారు. ఆ తర్వాత అతను లేచి వెళ్లిపోయాడు. ఈ వీడియో చూసిన కొందరు మొదట అయ్యో అయ్యో అనుకున్నారు. మరికొందరైతే ఖంగుతున్నారు. అయితే ఈ ప్రమాదంలో ఆ వ్యక్తికి చిన్న చిన్న గాయాలు కావడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు అతనికి భూమి మీద ఇంకా నూకలున్నాయి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
0 Comments