Ad Code

మంత్రిపై బురద చల్లిన వరద బాధితులు !


రద ప్రభావిత ప్రాంతాలను సందర్శించేందుకు వెళ్లిన తమిళనాడు మంత్రి తిరు పొన్ముడికి చేదు అనుభవం ఎదురైంది. మంత్రి రావడాన్ని గమనించిన వరద బాధితులు చేతుల్లో బురదతో స్వాగతం పలికారు. అంతేకాకుండా కొందరు ఆయనపై బురద చల్లారు. దీనికి సంబంధించిన వీడియోను భాజపా నేత కే. అన్నామలై 'ఎక్స్‌' (ట్విటర్‌) వేదికగా పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ''తమిళనాడులో ప్రస్తుతం పరిస్థితి ఇలా ఉంది. సీఎం స్టాలిన్‌, డిప్యూటీ సీఎం ఉధయనిధి చెన్నై వీధుల్లో ఫొటోలు దిగడంలో బిజీగా ఉన్నారు. నగరంలో వర్షం తక్కువగా కురిసింది. కానీ, చుట్టు పక్కల ప్రాంతాల్లో పరిస్థితులను వారు పట్టించుకోవడం లేదు'' అంటూ విమర్శించారు. ''నేడు ప్రజలు ఒక అవినీతి మంత్రిపై బురద చల్లారు. బాధితుల ఆవేదన ఏ స్థాయిలో ఉందో మనకు అవగతం అవుతోంది. డీఎంకేకి ఇదో ముందస్తు హెచ్చరిక'' అని భాజపా నేత పేర్కొన్నారు. కాగా.. ఫెయింజల్‌ తుపాను తమిళనాడు, పుదుచ్చేరిలో విలయం సృష్టించింది. ఇప్పటివరకు 20 మందికి పైగా మంది ప్రాణాలు కోల్పోయారు. తుపాను తీవ్రతకు కొండపై నుంచి పెద్దబండరాళ్లు దొర్లి ఇళ్లుపై పడ్డాయి. పలువురు మట్టిలో పూర్తిగా కూరుకుపోయారు. వారిని గుర్తించేందుకు సహాయక సిబ్బంది చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే ప్రభావిత ప్రాంతాలను సందర్శించేందుకు వెళ్లిన మంత్రికి ఈ అనుభవం ఎదురైంది.

Post a Comment

0 Comments

Close Menu