Ad Code

తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫారసు లేఖలకు చంద్రబాబు నాయుడు గ్రీన్‌ సిగ్నల్‌ !


తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌ బీఆర్‌ నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సమావేశమై తెలంగాణకు చెందిన ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖల అంశంపై సోమవారం చర్చించారు. తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు వారానికి రెండు సిఫార్సు లేఖలకు అనుమతిస్తూ టీటీడీ తీసుకున్న నిర్ణయానికి సీఎం అంగీకరించారు. వారానికి రెండుసార్లు రూ.300 దర్శనానికి సంబంధించిన సిఫారసు లేఖలకు చంద్రబాబు ఆమోదం తెలిపారు.  టీటీడీ తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను అనుమతించకపోవడం వివాదాస్పదంగా మారింది. అయితే, గత కొద్దిరోజుల కిందట టీటీడీ ఈవో శ్యామల రావు శ్రీవారి దర్శనానికి ఏపీ నుంచి వచ్చిన సిఫారసు లేఖలు మాత్రమే అనుమతిస్తున్నామని, తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను తీసుకోవడం లేదని స్పష్టం చేశారు. అయితే, విషయంలో రాష్ట్రానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే టీటీడీ పాలకమండలి సమావేశంలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖల అంశంపై చర్చించారు. బోర్డు సభ్యులు లేఖలను పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. పాలకమండలి నిర్ణయం మేరకు బోర్డు చైర్మన్‌ బీఆర్‌ నాయుడు చంద్రబాబుతో చర్చించారు. ఈ సందర్భంగా సిఫారసు లేఖలకు సీఎం ఆమోదం తెలిపారు.

Post a Comment

0 Comments

Close Menu