Ad Code

డయాబెటిస్ బాధితులు - పీనట్స్‌ !


వేరుశనగల్లో వివిధ రకాల పోషకాలు ఉంటాయి. ప్రతిరోజు పీనట్స్ తింటే ప్రొటీన్, విటమిన్ B6, B9, B కాంప్లెక్స్‌తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు, పాటోథెనిక్ యాసిడ్ వంటివి శరీరానికి అందుతాయి. డయాబెటిస్ బాధితులు ప్రతి రోజు ఉదయం వీటిని తింటే బ్లడ్ షుగర్ కంట్రోల్‌ అవుతుందని 'బ్రిటిష్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్‌'లో పబ్లిష్ అయిన అధ్యయనం వెల్లడించింది. వేరుశనగలో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. ఇది నెమ్మదిగా అరిగి, రక్తంలో చర్కెర స్థాయులను అదుపు చేస్తుంది. దీంతో పాటు వేరుశనగలో సమృద్ధిగా ఉండే మెగ్నీషియం.. ఇన్సులిన్ ఉత్పత్తిని ఎంకరేజ్ చేస్తుంది. ఫలితంగా బ్లడ్‌లోని గ్లూకోజ్ అణువులను శక్తిగా మార్చుతుంది. దీంతో బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి. వేరుశనగలోని ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండటంతో డైజేషన్ ఇంప్రూవ్ అవుతుంది. ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి, షుగర్ పేషెంట్లు వేరుశనగలు తినొచ్చు. పీనట్స్‌లోని పోషకాలు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ స్థాయులను పెంచుతాయి. దీంతో రక్తనాళాల్లో అడ్డుగోడలు పేరుకుపోకుండా నివారించి రక్త సరఫరా సాఫీగా సాగుతుంది. ఇది గుండెపై ఒత్తిడిని తగ్గించి ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు, అమైనో ఆమ్లాలు రక్తనాళాలను చురుగ్గా ఉంచుతాయి. రక్తనాళాల్లో గడ్డలు కట్టకుండా నివారించి హార్ట్ ఎటాక్, స్ట్రోక్ వంటి గుండె సంబంధిత సమస్యల బారిన పడే ముప్పు తగ్గుతుంది. వేరుశనగలో ఫైబర్‌తో పాటు ప్రొటీన్, మోనోశాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి. డయాబెటిస్ పేషెంట్లు వీటిని తింటే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఫలితంగా గుండె వ్యాధుల ముప్పు కూడా తగ్గిపోతుంది. పీనట్స్‌లో హెల్తీ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. ప్రతిరోజు పీనట్స్ తింటే బాడీలో మంచి కొలెస్ట్రాల్ డెవలప్ అవుతుంది. క్రమంగా ఇది హెల్తీ సెల్స్ ఫార్మేషన్‌కి దారితీస్తుంది. మరోవైపు, పీనట్స్ తింటే డయాబెటిస్‌కి ప్రధాన కారకాల్లో ఒకటైన ఊబకాయం సమస్య కూడా రాదు. వేరుశనగలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీంతో వీటిని తిన్న వెంటనే కడుపు నిండిన భావన కలిగి త్వరగా ఆకలి వేయదు. ఇతర ఫుడ్స్ తినాలని కూడా అనిపించదు. దీంతో కొవ్వు పేరుకుపోకుండా నివారించి బరువు పెరగకుండా చేస్తుంది.

Post a Comment

0 Comments

Close Menu