Ad Code

ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్ కు అర్హత సాధించిన దక్షిణాఫ్రికా !


సీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్ 2025 చేరిన మొట్టమొదటి జట్టుగా దక్షిణాఫ్రికా అవతరించింది. డబ్ల్యూటీసీ ఫైనల్స్ చేరడం కూడా ఆ జట్టుకు ఇదే తొలిసారి. ఇక రెండో స్థానం కోసం ఆస్ట్రేలియా, భారత్, న్యూజిలాండ్ పోటీ పడుతోన్నాయి. సెంచూరియన్ పార్క్ స్టేడియంలో పాకస్తాన్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఘన విజయాన్ని సాధించింది దక్షిణాఫ్రికా. రెండు వికెట్ల తేడాతో పాక్‌ను మట్టికరిపించింది. గెలవడానికి అవసరమైన 147 పరుగులను అతి కష్టం మీద ఛేదించింది. ఎనిమిది వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. ఈ విజయంతో డబ్ల్యూటీసీ ఫైనల్స్‌లో బెర్త్‌ను ఖరారు చేసుకుంది దక్షిణాఫ్రికా. 2025 జూన్ 11వ తేదీన లండన్‌లోని లార్డ్స్ స్టేడియం ఈ ఫైనల్ మ్యాచ్‌కు ఆతిథ్యాన్ని ఇవ్వనుంది. ఫైనల్స్‌లో దక్షిణాఫ్రికాను ఢీ కొట్టబోయే జట్టు ఏది అనేది ఇంకా తేలాల్సి ఉంది. ఈ రేసులో ఆస్ట్రేలియా ముందంజలో ఉంది. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఆస్ట్రేలియా, మూడో స్థానంలో భారత్, నాలుగోలో న్యూజిలాండ్ ఉన్నాయి. మ్యాచ్ గెలిస్తే ఒక్కో జట్టుకు 12 పాయింట్లు లభిస్తాయి. మ్యాచ్ టై అయితే- 6, డ్రా అయితే- 4 పాయింట్లు లభిస్తాయి. పాయింట్ల పర్సంటేజీ ఆధారంగా చేసుకుని ర్యాంకులను ఐసీసీ నిర్ధారిస్తుంది. ప్రస్తుతం ఈ పాయింట్ల పట్టికలో దక్షిణాఫ్రికా 11 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది.

Post a Comment

0 Comments

Close Menu