ఇన్ఫోసిస్ మైసూరు ప్రాంగణంలో పనిచేసే ఉద్యోగులకు వార్నింగ్ మెయిల్స్ పంపించింది. ఈ మెయిల్స్ సారాంశం ఏంటంటే ఇక నుంచి ఆ బ్రాంచ్ ఉద్యోగులంతా ఇంట్లోంచే పని చేయాలి. తిరిగి చెప్పేవరకు ఇంట్లోంచే పనిచేయాల్సి ఉంటుంది. నిబంధనలు అతిక్రమిస్తే ప్రమాదంలో పడతారని కూడా హెచ్చరించింది. హెచ్ఆర్ నుంచి ఈ మెయిల్స్ ఉద్యోగులందరికీ వెళ్లింది. ఇన్ఫోసిస్ మైసూరు ప్రాంగణం ఉన్న హెబ్బాల్ ఇండస్ట్రియల్ ఏరియా రిజర్వ్ ఫారెస్టుకు సమీపంలో ఉంది. ఈ ప్రాంతమంతా చిరుత పులులకు నిలయం. ఈ మధ్య రెండు మూడ్రోజులుగా క్యాంపస్లో చిరుత పులులు తిరుగుతూ కన్పించాయి. దాంతో ఉద్యోగుల రక్షణార్ధం సంస్థ అందరికీ వర్క్ ఫ్రం హోం ఇచ్చింది. అటు అటవీశా, ఇటు టాస్క్ఫోర్స్ సిబ్బందితో జల్లెడ పడుతోంది. ఈ ప్రాంగణంలో చిరుత పులులు సంచరించడం కొత్తేమీ కాదు. గతంలో కూడా అంటే 2011లో ఓ చిరుత ఇలానే హల్చల్ చేసింది. ఇప్పుడు మరోసారి చిరుత సంచారం ఉండటంతో కంపెనీ ఉద్యోగుల్ని ఇంట్లోంచి పని చేసుకోమని స్పష్టం చేసింది.
0 Comments