కలకత్తా - చెన్నై జాతీయ రహదారిపై లింగాలవలస సమీపంలో గురువారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. లారీని కారు వెనుక నుంచి బలంగా ఢీకొంది. ఘటనలో నెల్లూరుకు చెంది చెన్నైలో స్థిరపడిన భార్యాభర్త నాగిశెట్టి సాయిలీల (72), యదుకుమార్ (83) అక్కడికక్కడే మృతి చెందారు. కోడలకు తీవ్ర గాయాలయ్యాయి. కళ్లదుటే తల్లిదండ్రు లు మృతిచెందడం, భార్య తీవ్రగాయాలపాలై కోమాలోకి వెళ్లడం చూసి అశోక్బాబు తీవ్రంగా రోదిస్తున్నాడు. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాలిలా మేరకు నెల్లూరుకు చెంది తమిళనాడు రాష్ట్రం చెన్నైల్లో స్థిరపడిన నాగిశెట్టి యదుకుమార్ కుటుంబం నాలుగు రోజుల కిందట తీర్థయాత్రలకు బయలుదేరారు. కారులో వారి కుమారుడు అశోక్బాబు, భార్య ప్రసన్న కూడా ఉన్నారు. చెన్నై నుంచి శ్రీకాకుళం వచ్చాక గురువారం అరసవల్లి, శ్రీముఖలింగం సందర్శించారు. అనంతరం సింహాచలం బయలుదేరారు. అటు తర్వాత చెన్నై తిరిగి ప్రయాణమవ్వాలని భావించారు. శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం కారులో బయలుదేరాక భోగాపురం మండలం లింగాలవలస సమీపానికి వచ్చేసరికి ముందు వెళ్తున్న లారీని, కారు బలంగా ఢీకొంది. ఆ దాటికి కారు ఒక పక్కభాగం నుజ్జునుజ్జయింది. వెనుక కూర్చున్న సాయిలీల కారులోనే మృతి చెందగా యదుకుమార్ రోడ్డుపై పడి తీవ్రంగా గాయపడి ప్రాణం వదిలారు. ముందు సీటులో ఉన్న ప్రసన్న తీవ్రంగా గాయపడింది. డ్రైవింగ్ చేస్తున్న అశోక్బాబు క్షేమంగా బయటపడ్డాడు. విష యం తెలిసి మార్క్ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగార్రాజు, స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని గాయాల పాలైన ప్రసన్నను క్షణాల్లో విజయనగరం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. కళ్లదుటే తల్లిదండ్రులు మృతి చెందడం, భార్య గాయాలు పాలవడంతో అశోక్బాబు కొద్దిసేపు మిన్నకుండిపోయాడు. కొంత సమయం తరువాత తేరుకొని కన్నీటి పర్యంతమయ్యాడు. సీఐ ఎన్ని ప్రభాకర్, ఎస్ఐ సూర్యకుమారి సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
0 Comments