Ad Code

బైక్ కొనేందుకు నవజాత శిశువును విక్రయించిన దంపతులు !


డిశాలోని బాలాసోర్ జిల్లా బస్తా ప్రాంతానికి చెందిన దంపతులు బైక్ కొనుక్కోవాలనే కారణంతో తమ తొమ్మిది రోజుల నవజాత శిశువును రూ.60 వేలకు విక్రయించినట్లు సమాచారం. ఈ అక్రమ చర్యపై సమాచారం అందుకున్న పోలీసులు నవ దంపతుల నుంచి చిన్నారికి విముక్తి కల్పించారు. నిందితులైన దంపతులు, తమ బిడ్డను పెంచలేకపోవడం వల్లే తమ బిడ్డను దానం చేశామని చెప్పారు. పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితులైన తల్లిదండ్రులు మయూర్‌భంజ్ జిల్లా ఉడాలాలోని సంకుల గ్రామానికి చెందిన సంతానం లేని దంపతులకు తమ బిడ్డను రూ.60,000కు విక్రయించారు. డబ్బును బైక్ కొనుగోలుకు వినియోగించుకున్నారు. అయితే ఈ ఆరోపణలను తోసిపుచ్చిన దంపతులు.. పేదరికం కారణంగా బిడ్డను పెంచుకోలేక బిడ్డను దానం చేసినట్లు తెలిపారు. సిడబ్ల్యుసి సభ్యుడు మన్మోహన్ ప్రధాన్ మాట్లాడుతూ.. “బిడ్డను విక్రయించారనే సమాచారంతో మేము పోలీసులతో కలిసి, బిడ్డను కొనుగోలు చేసిన జంట ఇంటికి వెళ్లాం. అక్కడ నవజాత శిశువును గుర్తించాం. శిశువు సురక్షితంగా ఉంది.” అని పేర్కొన్నారు. 

Post a Comment

0 Comments

Close Menu