తెలంగాణలో 4G కోర్ సర్వీసులను ప్రారంభించినట్లు బీఎస్ఎన్ఎల్ తెలిపింది. ఇందుకు సంబంధించిన వివరాలను ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది. తెలంగాణ ప్రజలు ఇప్పటి నుంచి హైస్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యాన్ని పొందనున్నారని తెలిపింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలు సహా దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్ లోకి యూజర్లు వచ్చి చేరుతున్నారు. బీఎస్ఎన్ఎల్ 5G సేవలు అందించేందుకు దేశవ్యాప్తంగా సంస్థకు ఉన్న ఖాళీ స్థలాలు, భవనాల ద్వారా నగదు సమీకరించుకోవాలని భావిస్తోంది. ఖాళీ స్థలాలను విక్రయించేందుకు మరియు భవనాలను అద్దెకు ఇవ్వనుంది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. ఇందులో భాగంగా ఏపీ, తెలంగాణలోని స్థలాలు, బిల్డింగ్ లను గుర్తించారు. టెలికాం రెగ్యూలేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) లెక్కల ప్రకారం సెప్టెంబర్ నెలలో సుమారు 8 లక్షల మంది యూజర్లు బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్లోకి పోర్టింగ్ అయ్యారు. జులై, ఆగస్టు నెలల్లోనూ భారీ సంఖ్యలో మొబైల్ యూజర్లు బీఎస్ఎన్ఎల్ లో చేరారు. అదే సమయంలో జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా (VI) సంస్థలు భారీగా యూజర్లను కోల్పోతున్నాయి.
0 Comments