Ad Code

సైబర్ దాడితో 300 బ్యాంకుల సేవలకు అంతరాయం !


టెక్నాలజీ సర్వీస్ ప్రొవైడర్ సి-ఎడ్జ్ టెక్నాలజీస్‌పై సైబర్ దాడి జరిగింది. దీంతో దేశవ్యాప్తంగా దాదాపు 300 చిన్న బ్యాంకులు, ఆర్థిక సంస్థల బ్యాంకింగ్ సంబంధిత పనులు నిలిచిపోయాయి. ఖాతాదారులు కూడా ఏటీఎం నుంచి డబ్బులు తీసుకోలేకపోతున్నారు. ఇదే సమయంలో UPI ద్వారా నగదు బదిలీ చేయడంలో సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ మేరకు అధికారులు సమాచారం అందించారు. ఈ సాంకేతిక సమస్యలు SBI, TCS జాయింట్ వెంచర్ సి-ఎడ్జ్ టెక్నాలజీస్‌పై ఆధారపడిన సహకార బ్యాంకులు, గ్రామీణ ప్రాంతీయ బ్యాంకుల కస్టమర్లను ప్రభావితం చేయలేదు. అయితే ఇతర బ్యాంకింగ్ సేవలు సాధారణంగా నడుస్తున్నాయి. ఇండియాలోని 300 చిన్న బ్యాంకులకు టెక్నాలజీ సపోర్ట్ అందిస్తోన్న C-Edge Technologiesపై ransomware అటాక్ జరిగినట్లు తెలుస్తోంది. ఆయా బ్యాంకుల RTGS, యూపీఐ, ఏటీఎం సర్వీసులు నిలిచిపోయాయి.ఇందులో ఎక్కువ సంఖ్యలో RRBలు, కోఆపరేటివ్ బ్యాంకులు ఉన్నాయి. అయితే దీనిపై C-Edge Technologies ఇంకా స్పందించలేదు. ransomware వల్ల పెద్ద బ్యాంకులపై ఎలాంటి ప్రభావం పడలేదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. C-Edge Technologies తన సిస్టమ్‌లో ఉల్లంఘనను గుర్తించిన తర్వాత గత రెండు రోజులుగా ఈ సమస్యను ఎదుర్కొంటోంది. అధికారుల ప్రకారం.. పెద్ద చెల్లింపుల వ్యవస్థ భద్రత కోసం సి-ఎడ్జ్ వ్యవస్థను వేరు చేయాల్సి వచ్చింది. దీంతో పాటు అవసరమైన జాగ్రత్తలు కూడా తీసుకున్నారు.

Post a Comment

0 Comments

Close Menu