సూపర్ మార్కెట్లలో పీక్ టైమ్లో బిల్ కౌంటర్ వద్ద క్యూ కట్టడం వల్ల షాపింగ్కు వచ్చేవారు ఎక్కువ సమయం వృధా చేసుకుంటున్నారు. కానీ త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం లభించనుంది. ఇప్పటి వరకు, వినియోగదారులు సూపర్ మార్కెట్లలో వస్తువులను ఉంచడానికి సాధారణ ట్రాలి వంటి దాన్ని వాడుతుంటారు. ఇందులో సరుకులు ఉంచిన తర్వాత బిల్లు కౌంటర్ వద్దకు వెళ్లి బిల్లు తెచ్చుకోవాలి. అయితే ఇటీవల అమెరికాలోని న్యూయార్క్లోని సూపర్ మార్కెట్లో ఏఐ కార్ట్ని వాడారు. ఆ తర్వాత కస్టమర్ బిల్లు కౌంటర్కు వెళ్లాల్సిన అవసరం లేదు. న్యూయార్క్ సూపర్ మార్కెట్లో ఉపయోగిస్తున్న ఏఐ కార్ట్లో ఏదైనా వస్తువును ఉంచిన వెంటనే, దాని మొత్తం కార్ట్లోని డిస్ప్లేలో కనిపించడం ప్రారంభమవుతుంది. దీని తర్వాత కొనుగోలు చేసిన ప్రతి వస్తువు మొత్తం దానికి జోడిస్తుంది. ఇది ‘గేమిఫికేషన్’ ఫీచర్ను కూడా కలిగి ఉంది. ఇది కొంత మొత్తాన్ని ఖర్చు చేస్తే రివార్డ్లను ఇస్తుంది. ఈ స్మార్ట్ కార్ట్ అమెరికాలోని అనేక సూపర్ మార్కెట్లలో విజయవంతంగా పరీక్షించారు. కస్టమర్లు కూడా దీన్ని ఇష్టపడుతున్నారు. త్వరలో ఈ ఏఐ ట్రాలీ బండి భారత్లో కూడా దూసుకుపోనుంది.

0 Comments