Ad Code

ఓడినా రాహుల్‌ వైఖరి మారలేదు : అమిత్‌ షా !


ఝార్ఖండ్‌ రాజధాని రాంచీలో జరిగిన పార్టీ మీటింగ్‌లో పాల్గొన్న అమిత్‌ షా,  రాహుల్‌పై విరుచుకుపడ్డారు. ''ఎన్నికల్లో గెలిచిన తర్వాత కొందరు నాయకులకు అహంకారం పెరుగుతుందని ఇప్పటివరకు విన్నాను. ఝార్ఖండ్‌లోనూ అలాంటి వారే అధికారంలో ఉన్నారు. కానీ, అధికారంలో లేకపోయినప్పటికీ అహంకారం కలిగిన వ్యక్తిని మొదటిసారి చూస్తున్నా. పార్లమెంట్‌లో ఎన్నోసార్లు రాహుల్‌ గాంధీ అహంకారం ప్రదర్శించారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎవరు గెలిచారో అందరికీ తెలిసిన విషయమే. కానీ, కొందరు ఓటమిని ఒప్పుకోలేకపోతున్నారు'' రాహుల్‌ను ఉద్దేశిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ''లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి పూర్తి మెజారిటీ దక్కింది. ఇది ఇండియా కూటమికి దక్కిన స్థానాల కంటే ఎక్కువ. అలాంటప్పుడు వారికి ఎందుకింత అహంకారం?వరుసగా ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది. కానీ, ఈ వాస్తవాన్ని అంగీకరించలేకపోతున్నారు'' అని షా దయ్యబట్టారు. జైలు నుంచి వచ్చిన అనంతరం మళ్లీ సీఎం పీఠమెక్కిన హేమంత్‌ సోరెన్‌పై అమిత్‌ షా తీవ్ర విమర్శలు గుప్పించారు. ''హేమంత్‌ సోరెన్‌ నేతృత్వంలోని ప్రభుత్వం దేశంలో కెల్లా అత్యంత అవినీతిపరమైంది. మద్యం, భూకుంభకోణాలకు పాల్పడి రూ. కోట్లు కొల్లగొట్టారు'' అని ఆరోపించారు. రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో భాజపా ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమన్నారు.

Post a Comment

0 Comments

Close Menu