ఈ నెల 8 నుంచి 10వ తేదీ వరకు ప్రధాని మోడీ రష్యాతో పాటు ఆస్ట్రియాలో అధికారిక పర్యటన చేయనున్నారు. మోడీ పర్యటనకు సంబంధించి భారత విదేశాంగ శాఖ తెలియజేసింది. గత ఐదేళ్లలో మోడీ రష్యా పర్యటన తొలిసారి కావడం గమనార్హం. ఉక్రెయిన్పై రష్యా దాడుల తర్వాత మాస్కోను మోడీ సందర్శించడం ఇదే తొలిసారి. భారత ప్రధాని ఆస్ట్రియాకు వెళ్లడం 41 ఏళ్లలో ఇదే ప్రథమం. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆహ్వానం మేరకు ప్రధాని మోడీ ఈ నెల 8, 9 తేదీల్లో రష్యాలో పర్యటించనున్నారు. 22వ భారత్ – రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశంలో మోడీ పాల్గొంటారు. అంతే కాకుండా ఇరు దేశాల మధ్య సంబంధాలను నేతలిద్దరూ చర్చిస్తారు. ప్రాంతీయ, ప్రపంచ అంశాలపై చర్చలు జరుపనున్నారు. ఈ తర్వాత ఆస్ట్రియాకు మోడీ వెళ్లనున్నారు. అక్కడి స్థానిక నేతలతో మోడీ సమావేశం అవుతారు. అక్కడి వ్యాపార ప్రముఖులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. మాస్కో, వియన్నాల్లోని ప్రవాస భారతీయులతో మోదీ మాట్లాడనున్నారని విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.
0 Comments