Ad Code

ప్రజల ఆకాంక్ష నెరవేరింది : పవన్ కల్యాణ్ !


ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో విజయ దుందుభి మోగించిన టీడీపీ కూటమి భారీ మెజారిటీతో దుమ్మురేపింది. వైఎస్ జగన్ పార్టీ కేవలం 10 సీట్లకు మాత్రమే పరిమితం అయ్యింది. కూటమి ఎన్నికల విజయంలో జనసేన నేత పవన్ కల్యాణ్ కీలక పాత్ర పోషించారని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు. జనసేన పోటీ చేసిన 21 సీట్లలో గెలుపొందింది. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ నాకు వ్యక్తిగతంగా శత్రవు కాదు. ఓడిపోయారని చెప్పి కక్ష్య సాధింపు సమయం కాదు. ఏపీ విభజన జరిగిన తర్వాతి నుంచి మగ్గుతూనే ఉన్నాం. ఆ చీకటి రోజులు ముగిశాయి. ప్రతి ఒక్కరూ భవిష్యత్ కోసం జవాబుదారీతనంతో కూడిన రాజకీయ విధానం ఉంటుంది. నా జీవితంలో ఇప్పటిదాకా విజయం తెలీదు. ఎప్పుడూ ఒకే ఒకసారి సినిమా రిలీజ్ తర్వాత తొలి ప్రేమ తర్వాత విజయం దక్కింది. నా జీవితం అంతా దెబ్బలు తింటూ, బాధలు పడుతూ గడిపాను. దేశంలో వందకు వంద శాతం కొట్టామంటే జనసేననే. ఈ విజయం జనసేన నాయకులదే కాదు. 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్ష. మార్పు కోరుకుంటున్నారు. పాలన మారాలని చూశారు. ప్రజా ఆకాంక్ష నెరవేరింది.

Post a Comment

0 Comments

Close Menu