Ad Code

ఎర్రవెల్లిలో సెప్టెంబర్ 6న బీఆర్ఎస్ శాసనసభా పక్ష సమావేశం

తెలంగాణ శాసనసభ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేసేందుకు బీఆర్ఎస్ శాసనసభా పక్ష సంయుక్త సమావేశాన్ని సెప్టెంబర్ 6న ఏర్పాటు చేశారు. సెప్టెంబర్ 07వ తేదీ నుంచి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అసెంబ్లీ ప్రారంభానికి ఒక రోజు ముందు ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసంలో ఈ కీలక భేటీ జరగనుంది. మధ్యాహ్నం 1 గంటకు ప్రజాప్రతినిధులకు లంచ్ ఏర్పాటు చేయగా, అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు కేసీఆర్ అధ్యక్షతన సమావేశం ప్రారంభమవుతుంది. ఈ భేటీకి బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరూ తప్పనిసరిగా హాజరుకావాలని కేసీఆర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వంపై సభలో ఎలాంటి అంశాలపై ఒత్తిడి తీసుకురావాలి, ప్రజా సమస్యలపై సర్కార్‌ను ఎలా నిలదీయాలి అనే అంశాలపై గులాబీ బాస్ ప్రజాప్రతినిధులకు రోడ్‌మ్యాప్ ఇవ్వనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉభయ సభల్లో సమర్థవంతంగా ఇరుకున పెట్టేలా బలమైన కార్యాచరణను ఈ సమావేశంలో ఖరారు చేయనున్నారు.

Post a Comment

0 Comments

Close Menu