హిమాచల్ప్రదేశ్లోని సోలన్ జిల్లా జాతీయ రహదారి భరాడీఘాట్ సమీపంలో ప్రయాణిస్తున్న ఒక కారుపై ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడ్డాయి. కొండ పైభాగం నుంచి భారీ బండరాయి వేగంగా వచ్చి కారుపై పడటంతో ఒకరు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు, అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన ఇద్దరినీ తక్షణమే సమీపంలోని ఆసుపత్రికి తరలించి అత్యవసర వైద్య చికిత్స అందిస్తున్నారు. కారుపై బండరాయి పడి క్షణాల్లో ధ్వంసమైన తీవ్రతకు సంబంధించిన వీడియోలు ప్రసుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. కొండచరియలు విరిగిపడటంతో జాతీయ రహదారిపై కొంతసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
0 Comments