Ad Code

హోర్ముజ్ జలసంధి ద్వారా నౌకల రాకపోకలు : ఇరాన్‌-ఒమన్ మధ్య కుదిరిన ఒప్పందం

హోర్ముజ్ జలసంధి ద్వారా నౌకల రాకపోకల కోసం ఇరాన్, ఒమన్ ఒక ఒప్పందానికి అంగీకరించాయి. అయితే ఈ జలసంధిని తెరిచే విషయం కొన్ని వర్గాల పై ఆధారపడి ఉంటుందని టెహ్రాన్ స్పష్టం చేసింది. ఈ వ్యూహాత్మక జలసంధి వర్తక నౌకలన్నింటికీ తెరిచే ఉండాలని భావిస్తున్న అమెరికాను ఉద్దేశించే ఇరాన్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు కనిపిస్తోంది. మధ్యప్రాచ్యంలో ఫిబ్రవరి 28న ఘర్షణలు ప్రారంభమైనప్పటి నుండి హోర్ముజ్ జలసంధి ఇరాన్ యొక్క ప్రత్యక్ష నియంత్రణలో ఉంది. అయితే ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బాఘాయ్ మాట్లాడుతూ..ఒమన్‌తో సంతకం చేయడానికి డ్రాఫ్ట్ ఒప్పందం సిద్ధంగా ఉందని తెలిపారు. మరొకవైపు, హోర్ముజ్‌ను తిరిగి తెరవడానికి ఒప్పందం 'త్వరలోనే జరగవచ్చని' అమెరికా పేర్కొంటోంది. రెండు దేశాలు ప్రతిపాదించిన మార్గం యొక్క భౌగోళిక నిరూపకాలపై ఒప్పందం కుదిరింది. ఒకవేళ మూడో పక్షాలు ఈ ప్రక్రియను అడ్డుకోకపోతే ప్రధానాంశాలు మరియు ఒప్పంద వివరాలతో కూడిన రెండు దేశాల ఉమ్మడి ప్రకటన చివరి సమీక్ష మరియు ముసాయిదా దశలో ఉంది అని బాఘాయ్ పేర్కొన్నారు. హోర్ముజ్ జలసంధిలో అభద్రతకు కారణమయ్యే అంశాలు అమెరికా వైపు నుండి ఇప్పటికీ ఉన్నాయని ముఖ్యంగా నావికాదళ ముట్టడితో పాటు ఇరాన్ మరియు దాని ప్రయోజనాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఇతర దూకుడు, బెదిరింపు చర్యలు అలానే ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రపంచవ్యాప్త క్రూడ్ ఆయిల్‌లో దాదాపు ఐదో వంతు హోర్ముజ్ మార్గం ద్వారానే రవాణా అవుతుంది. ప్రపంచ సరఫరా వ్యవస్థలో సమతుల్యతను కాపాడటానికి ఇది అత్యంత కీలకమైనది. ఐదు నెలల క్రితం యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు వరుసగా పెరుగుతూనే ఉన్నాయి. ఇది అమెరికా తన సైనిక చర్యలను త్వరగా ముగించాలనే ఒత్తిడిని పెంచుతోంది.

Post a Comment

0 Comments

Close Menu