Ad Code

చెక్‌పాయింట్ వద్ద సైనికులతో వాగ్వాదానికి దిగిన మహిళా టూరిస్ట్ : సోషల్ మీడియాలో వీడియో వైరల్

డాఖ్‌లోని కార్గిల్ జిల్లా మినీమార్గ్ చెక్‌పాయింట్ వద్ద ఓ మహిళా టూరిస్ట్ భద్రతా దళాల అధికారులతో తీవ్రంగా వాగ్వాదానికి దిగిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. భద్రతా కారణాలు, సైనిక వాహనాల రాకపోకల దృష్ట్యా అధికారులు రోడ్డును కొంతసేపు మూసివేయడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన సదరు మహిళ తాను జెన్-జీ అని, ఇటువంటి చర్యలను సహించేదని లేదని హెచ్చరించింది. అంతే కాకుండా తాము చెల్లించిన పన్నుల డబ్బుతోనే సైనికులకు జీతాలు ఇస్తున్నారంటూ వారిపై కేకలు వేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో బయటకు వచ్చిన వెంటనే నెటిజన్లు, మాజీ సైనికాధికారులు సదరు మహిళ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశ రక్షణలో కీలకమైన సైనికులు కూడా పన్నులు చెల్లిస్తారని, సరిహద్దు లాంటి అత్యంత సున్నితమైన ప్రాంతాల్లో భద్రతా నిబంధనలను పాటించడం ప్రతి పౌరుడి బాధ్యత అని గుర్తుచేశారు. గడ్డకట్టే చలిలో ప్రాణాలను ఫణంగా పెట్టి విధుల్లో ఉండే సైనికులను పన్నుల పేరుతో అవమానించడం తగదని మండిపడ్డారు.

Post a Comment

0 Comments

Close Menu