తెలంగాణ మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్పై మేడ్చల్ మల్కాజగిరి జిల్లా మేడిపల్లిలో హత్యాయత్నం కేసు పోలీసులు నమోదు చేశారు. రాడ్లుతో దాడి చేసినట్లు వ్యాపారి గొంగడి హరికృష్ణ ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశారు. సుమంత్పై 109 సెక్షన్ కింద కేసు నమోదు అయ్యింది. అయితే మేడిపల్లిలో పీఎస్లో జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో ఇప్పుడు ఆ కేసు జూబ్లీహిల్స్కు బదిలీ అయ్యింది. సుమంత్తో పాటు మరో ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
0 Comments