తెలంగాణలోని నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో ఓ రెండేళ్ల చిన్నారి బాల్కనీలో ఆడుకుంటూ కింద పడి మృతి చెందింది. రాజస్థాన్ నుంచి వచ్చిన మాధవ్ సింగ్ – ప్రియాంక దంపతులు భైంసా పట్టణంలోని రాహుల్ నగర్లో అద్దె ఇంటిలో నివాసముంటున్నారు. వీరి కుమార్తె కీర్తి (2 ) శుక్రవారం బాల్కనీలో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు కింద పడి తలకు బలమైన దెబ్బ తగలడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
0 Comments