తెలంగాణలోని మేడ్చెల్ జిల్లాలోని ఘట్కేసర్ సమీపంలో రైలు కిందపడి దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. మృతులు వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం పాపయ్యపేట గ్రామానికి చెందిన రవికుమార్, శిరీషగా గుర్తించారు. ఘట్కేసర్ రైల్వే స్టేషన్ సపంలోని ఘట్కేసర్- బీబీనగర్ రైల్వే మార్గంలో రైలు కిందపడి దంపతులు ఆత్మహత్య చేసుకున్నరు. విషయం తెలిసిన వెంటనే జీఆర్పీ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వీరి మృతికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. దంపతుల మృతి సమాచారాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశారు.
0 Comments