ఇండోనేషియాలో పర్యటిస్తున్న ప్రధాని మోడీ వెయ్యేళ్ల నాటి యోగ్యకర్తలో ఉన్న ప్రంబనన్ ఆలయాన్ని సందర్శించి పూజలు నిర్వహించారు. ప్రధాని మోడీతో పాటు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో కూడా ఆలయానికి వెళ్లారు. ప్రంబనన్ ఆలయంలో త్రిమూర్తులు కొలువై ఉన్నారు. బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుల నిలయమే ప్రంబనన్ ఆలయం. ప్రస్తుతం ఈ ఆలయం.. ప్రపంచ వారసత్వ సైట్లో ఉన్నది. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్కు చెందిన ఏరియల్ వీడియోను ప్రధాని మోదీ తన ఎక్స్ అకౌంట్లో పోస్టు చేశారు. ప్రబంనన్ ఆలయం అద్భుతంగా ఉన్నట్లు ఆయన ట్వీట్ చేశారు.
0 Comments