Ad Code

నీట్, జేఈఈతో అడ్మిషన్లలో వెయిటేజీ ఇవ్వాలని బోర్డు నిర్ణయం ?

జాతీయ స్ధాయిలో వైద్య విద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న నీట్ లో చోటు చేసుకుంటున్న పేపర్ లీక్ ల నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకోబోతోంది. నీట్ తో పాటు జేఈఈ పరీక్షలకు జాతీయ స్ధాయిలో ఉంటున్న భారీ పోటీని నివారించడంతో పాటు అక్రమాలకు చెక్ పెట్టే దిశగా కీలక అడుగు వేయబోతోంది. ఇందులో భాగంగా బోర్డు పరీక్షల మార్కులకు ఇందులో నీట్, జేఈఈ అడ్మిషన్లలో వెయిటేజీ ఇవ్వాలని భావిస్తోంది. ప్రస్తుతం నీట్, జేఈఈ వంటి ప్రవేశ పరీక్షల స్కోర్‌ల ఆధారంగా జరుగుతున్న కీలక ప్రవేశాలలో, బోర్డు పరీక్షలకు 50 శాతం వెయిటేజ్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వైద్య, ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలు అయినా లేదా బోర్డు పరీక్షలు అయినా, ఏ పరీక్షకైనా ఉండే అధిక ప్రాధాన్యతను తగ్గించాలనే ఉద్దేశ్యంతో ఈ అవకాశాన్ని పరిశీలిస్తున్నారు. మూల్యాంకన లోపాలు, ప్రశ్నపత్రాల లీకేజీలతో సహా పరీక్షా విధానంలో జరిగిన వరుస అవకతవకల నేపథ్యంలో విద్యా వ్యవస్థ విశ్వసనీయతపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోబోతున్నారు. ప్రవేశాలు/మెరిట్‌లో బోర్డు మార్కులకు 50 శాతం వెయిటేజ్ ఇవ్వడం, కోచింగ్ సెంటర్లపై ఆధారపడటాన్ని తగ్గించడానికి ప్రవేశ పరీక్షలను పాఠశాల సిలబస్‌కు మరింత దగ్గరగా అనుసంధానించడం, పలుమార్లు ప్రయత్నించే అవకాశం కల్పించడం, క్రమంగా అడాప్టివ్ ఆన్-డిమాండ్ కంప్యూటర్ ఆధారిత పరీక్షల వైపు మళ్లడం వంటి మార్పులను కేంద్రం పరిశీలిస్తోంది. ప్రస్తుతం వైద్య, ఇంజనీరింగ్ ప్రవేశాలు ప్రవేశ పరీక్షల స్కోర్‌ల ఆధారంగా జరుగుతున్నాయి. ఇకపై ఆయా ప్రవేశ పరీక్షలకు అర్హత సాధించడానికి అభ్యర్థులు బోర్డు పరీక్షలలో అర్హత శాతాన్ని సాధించాల్సి ఉంటుంది. విద్యార్థులు కోచింగ్‌పై ఆధారపడటం, 'డమ్మీ పాఠశాలల' వ్యాప్తి, అత్యంత కీలకమైన ప్రవేశ పరీక్షలలో నిష్పక్షపాతాన్ని పరిశీలించడానికి గత సంవత్సరం విద్యా మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన తొమ్మిది మంది సభ్యుల కమిటీ ఈ సంస్కరణలను పరిశీలిస్తోంది. కమిటీ తుది నివేదికను త్వరలో ప్రభుత్వానికి సమర్పించనుంది. ప్రవేశ పరీక్షలను పాఠశాల సిలబస్‌కు మరింత దగ్గరగా అనుసంధానించాలని కమిటీ సిఫార్సు చేసింది.

Post a Comment

0 Comments

Close Menu