Ad Code

హైదరాబాద్ ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య

హైదరాబాద్ లోని గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీలో బీటెక్ కంప్యూటర్ సైన్స్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న అనిరూద్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 20 ఏళ్ల అనిరుద్ తాను ఉంటున్న బిల్డింగ్ 6వ అంతస్తు పై నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సంఘటన స్థలానికి చేరుకున్న గచ్చిబౌలి పోలీసులు మృతదేహన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు. మృతుడు ఖమ్మం జిల్లాకు చెందిన విద్యార్థి. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు గచ్చిబౌలి పోలీసులు తెలిపారు.

Post a Comment

0 Comments

Close Menu