ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి జిల్లా రేణిగుంట రైల్వే క్యారేజ్ రిపేర్ షాపులో భారీగా మంటలు చెలరేగాయి. పెద్దఎత్తున అగ్నికీలలు ఎగిసిపడడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. దీంతో సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని మంటలను అదుపు చేసే యత్నం చేస్తున్నారు. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగింది? ఎంత ఆస్తి నష్టం సంభవించిందనే వివరాలు తెలియాల్సి ఉంది.
0 Comments