Ad Code

క్రిస్టియన్ మైనారిటీలకు సంక్షేమ పథకాలు : ఓబీఎంఎంఎస్ పోర్టల్‌ను ప్రారంభించిన మంత్రి మహమ్మద్ అజారుద్దీన్

తెలంగాణలోని క్రిస్టియన్ మైనారిటీల సంక్షేమ పథకాల కోసం ప్రభుత్వం ఆన్‌లైన్ దరఖాస్తులను ప్రారంభించింది. ఈ మేరకు మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ ఓబీఎంఎంఎస్ పోర్టల్‌ను ప్రారంభించారు. అర్హులైన క్రిస్టియన్ మైనారిటీ అభ్యర్థులు ఈ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఈ సందర్భంగా మంత్రి అజారుద్దీన్ మాట్లాడుతూ కుట్టు మిషన్, పెట్టీ బిజినెస్, బైక్, ఈ-బైక్ వంటి స్వయం ఉపాధి పథకాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. జూలై 3 నుంచి జూలై 18 సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తులను స్వీకరిస్తామని వెల్లడించారు. మహిళలు, యువత స్వయం ఉపాధి సాధించి ఆర్థికంగా ఎదగాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ పథకాలను అమలు చేస్తోందని మంత్రి పేర్కొన్నారు. 

Post a Comment

0 Comments

Close Menu