E22, E25, E27, E30 మోడల్ పెట్రోల్ మీద ఎక్సైజ్ డ్యూటీని కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. దేశంలో కాలుష్య నివారణ కోసం ఇథనాల్ బ్లెండింగ్ పెట్రోల్ వినియోగించాలని కేంద్ర ప్రభుత్వం భావించింది. అందుకోసం పెట్రోల్లో ఇథనాల్ కలుపుతారు. ఆ ఇథనాల్ శాతం ఎంత కలిపితే దాన్ని ఆ పేరుతో పిలుస్తారు. E 25= 25శాతం ఇథనాల్, 75 శాతం పెట్రోల్, E 27 = 27శాతం ఇథనాల్, 73 శాతం పెట్రోల్, E 30 = 30శాతం ఇథనాల్, 70 శాతం పెట్రోల్ ప్రస్తుతం మనం వాడుతున్నది E20 పెట్రోల్. ఈ మధ్య కాలంలో మోటార్ కంపెనీలు కూడా ఇథనాల్ బ్లెండింగ్ ఎంత పెరిగినా తట్టుకోదగిన స్థాయిలో ఇంజిన్లను తయారు చేస్తున్నారు. అంటే E85 వాహనాలు కూడా మార్కెట్లోకి వచ్చాయి. వాటిని ఫ్లెక్స్ ఫ్యూయర్ వాహనాలు అంటారు. మారుతి సుజుకి వాగనార్ ఫ్లెక్స్ ఫ్యూయల్, హీరో స్ల్పెండర్ ప్లస్ ఫ్లెక్స్ ఫ్యూయల్, హీరో హెచ్ఎఫ్ డీలక్స్ ఫ్లెక్స్ ఫ్యూయల్, హోండా సీబీ300 ఎఫ్ ఫ్లెక్స్ ఫ్యూయల్ సుజుకి జిక్సర్ ఎస్ ఎఫ్ ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలు ఈ పెట్రోల్ తో నడిపించవచ్చు.
0 Comments