పశ్చిమ బెంగాల్లో గత అసెంబ్లీ ఎన్నికల్లో భవానీపూర్ సీటు నుంచి పోటీ చేసి సువేందు అధికారి చేతిలో ఓటమిపాలైన మమతా బెనర్జీ ఈ ఫలితాన్ని సవాల్ చేస్తూ కలకత్తా హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే ఆమె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇవాళ ఈ కేసు విచారణకు మమత స్వయంగా హాజరయ్యారు. ఈ కేసును మమతకు విధేయుడైన తృణమూల్ ఎంపీ, లాయర్ కళ్యాణ్ బెనర్జీ వాదిస్తున్నారు. ఇవాళ విచారణపై కళ్యాణ్ బెనర్జీ స్పందించారు. సువేందు అధికారి ఎన్నికను సవాలు చేస్తూ మమతా బెనర్జీ దాఖలు చేసిన ఎన్నికల పిటిషన్ను ధృవీకరించడానికి ఆమె ఈ రోజు కలకత్తా హైకోర్టుకు వచ్చారని కళ్యాణ్ బెనర్జీ తెలిపారు. ఆ ఎన్నిక సక్రమంగా జరగలేదని, 12 రౌండ్ల తర్వాత, మమతను , ఆమె ఎన్నికల ఏజెంట్ను కొట్టి బయటకు పంపేశారని తెలిపారు. అసలు ఆ రిటర్నింగ్ ఆఫీసర్ ఎవరు? 2021 నందిగ్రామ్ ఎన్నికల్లో ఆయనే ఆర్వోగావ్యవహరించారు. మళ్లీ ఇప్పుడు ఆయనే ఆర్వోగా వచ్చారు. ఆ తర్వాత, ఆయనను ముఖ్యమంత్రికి డిప్యూటీ సెక్రటరీగా నియమించారు, ఎన్నికలైన వెంటనే రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిని చీఫ్ సెక్రటరీగా నియమించారని కళ్యాణ్ బెనర్జీ ఆరోపించారు. వారిపై అనేక ఆరోపణలు ఉన్నాయని, అలాగే వారు పక్షపాతం చూపించే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తోందని తెలిపారు.
0 Comments