తమిళనాడులో ముఖ్యమంత్రి విజయ్ ఇవాళ 10 జన్ పథ్ కు వెళ్లి కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. అనంతరం గాంధీలతో తమిళనాడు ప్రభుత్వ పాలనతో పాటు జాతీయ స్దాయలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చలు జరిపారు. వీటిలో ఇండియా కూటమి తాజా భేటీపై కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. తాజాగా ఇండియా కూటమి నిర్వహించిన భేటీకి డీఎంకే దూరంగా ఉండిపోవడం, అదే సమయంలో ఎంపీలు లేని టీవీకేకు కాంగ్రెస్ ఆహ్వానం పంపకపోవడం చర్చనీయాంశమైంది.
0 Comments