ఎయిర్టెల్ ₹99కే లభించే ఎక్స్ట్రీమ్ ప్లే ప్లాన్ ఆఫర్ జూన్ 19తో ముగిసింది. 20కి పైగా ఓటీటీ ప్లాట్ఫామ్స్ను అందించే ఈ చౌకైన ప్లాన్ ధర ఇప్పుడు మళ్లీ పాత ధర ₹149కి చేరింది. దీంతో తక్కువ ధరలో ఎంటర్టైన్మెంట్ కోరుకునే బడ్జెట్ యూజర్లు ఇప్పుడు తమకు నచ్చిన ఓటీటీ సేవలను తక్కువ ధరలో పొందేందుకు ఇతర మార్గాలను వెతుకుతున్నారు. దీనికి పోటీగా రిలయన్స్ జియో తన ప్రీపెయిడ్ యూజర్ల కోసం ₹200 ఓటీటీ పాస్ను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో జియో సినిమా ప్రీమియం, డిస్నీ+ హాట్స్టార్తో పాటు మొత్తం 13 యాప్స్ సబ్స్క్రిప్షన్ లభిస్తుంది. విడివిడిగా సబ్స్క్రిప్షన్లు తీసుకునే కంటే ఇది చాలా బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఎయిర్టెల్ యూజర్లు కొన్ని నిర్దిష్టమైన పోస్ట్పెయిడ్ లేదా ఫైబర్ బ్రాడ్బ్యాండ్ ప్లాన్లకు అప్గ్రేడ్ అవ్వడం ద్వారా మరిన్ని ప్రయోజనాలు పొందవచ్చు. వీటిలో అమెజాన్ ప్రైమ్, డిస్నీ+ హాట్స్టార్ వంటివి అదనపు ఖర్చు లేకుండానే వస్తాయి.
0 Comments