Ad Code

ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన సంజయ్ జాజు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా సంజయ్ జాజు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తించిన కె.రామకృష్ణా రావు ఈ రోజు పదవీ విరమణ చేశారు. ఆయన స్థానంలో 1992 బ్యాచ్‌కు చెందిన అధికారి సంజయ్ జాజును రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 26న ఉత్తర్వులు జారీ చేసిన విషయం విదితమే. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, వివిధ శాఖల విభాగాధిపతులు, సచివాలయ అధికారులు, సిబ్బంది సంజయ్ జాజుతోపాటు కె.రామకృష్ణా రావును పుష్పగుచ్ఛాలతో అభినందించారు.కాగా, రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఎంసీఆర్ హెచ్‌ఆర్డీ బోధి పెవిలియన్‌లో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డిని సీఎస్ సంజయ్ జాజు మర్యాదపూర్వకంగా కలిశారు.

Post a Comment

0 Comments

Close Menu