రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మభూషణ్‌ అవార్డ్ అందుకున్న మమ్ముట్టి

ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో "పద్మ" అవార్డుల వేడుక జరిగింది. ప్రధాని మోడీతో పాటు కేంద్రమంత్రులు పాల్గొన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ‍మలయాళ స్టార్ మమ్ముట్టి పద్మభూషణ్ అవార్డ్, బాలీవుడ్ నటుడు ఆర్ మాధవన్ పద్మశ్రీ అవార్డ్‌ స్వీకరించారు.  మమ్ముట్టితో పాటు ప్రముఖ సింగర్ అల్కా యగ్నిక్‌ కూడా పద్మభూషణ్ అవార్డ్‌కు ఎంపికయ్యారు. పద్మశ్రీ అందుకున్న వారిలో భారత మాజీ క్రికెట్‌ కెప్టెన్ రోహిత్ శర్మ, టాలీవుడ్ నటుడు మురళి మోహన్, రాజేంద్ర ప్రసాద్ కూడా ఉన్నారు. అంతేకాకుండా ప్రముఖ జానపద కళాకారుడు గురు సంగ్యుసాంగ్ పొంగెనర్, అనిల్ కుమార్ రస్తోగి అవార్డులు అందుకున్నారు. దివంగత నటుడు సతీష్ షాకు పద్మశ్రీ అవార్డ్ రాగా ఆయన సోదరుడు అరవింద్ షా స్వీకరించారు.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org