ఆంధ్రప్రదేశ్ లోని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) చేపట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమం "మన వార్డులో - మన ఆదిరెడ్డి" విజయవంతంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా 1వ మరియు 2వ డివిజన్లలో ప్రజల మధ్య రాత్రి బస చేసిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, శనివారం ఉదయం నుంచే కూటమి నాయకులు, నగర పాలక సంస్థ అధికారులు, సచివాలయ సిబ్బందితో కలిసి ఆయా ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. ప్రతి వీధిలో నడుస్తూ, ప్రతి ఇంటి గడపకు వెళ్లి ప్రజలను నేరుగా కలుసుకుని వారి సమస్యలు, అవసరాలు, అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. తాగునీటి సరఫరా, డ్రైనేజీ వ్యవస్థ, రోడ్ల మరమ్మతులు, వీధి దీపాలు, పారిశుద్ధ్యం, సంక్షేమ పథకాల అమలు, పెన్షన్లు, రేషన్ కార్డులు, గృహ స్థలాలు, ఆరోగ్య సేవలు వంటి అంశాలపై స్థానిక ప్రజలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలు ఎదుర్కొంటున్న కుటుంబాలతో ప్రత్యేకంగా మాట్లాడి వారి ఇబ్బందులను తెలుసుకున్నారు. పర్యటన సందర్భంగా ప్రజలు ప్రస్తావించిన సమస్యలను అక్కడికక్కడే అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే వాసు పరిష్కారానికి అవసరమైన చర్యలు వెంటనే చేపట్టాలని ఆదేశించారు.
0 Comments