Ad Code

మహిళల ఆశీర్వాదంతోనే ఈ స్థాయికి ఎదిగా : సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉప్పల్ భగాయత్ లే అవుట్ లో రూ.1511 కోట్ల విలువైన అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళల ఆశీర్వాదంతోనే ఈ స్థాయికి ఎదిగానని,కొడంగల్‌లో ఓడినా తనను మల్కాజ్‌గిరి ఎంపీగా గెలిపించారని ప్రస్తావించారు. మల్కాజ్‌గిరి ఎంపీ నియోజకవర్గం అంటే మినీ భారత్‌ అని అభివర్ణించారు.  ఈ కార్యక్రమానికి మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహ, ప్రభుత్వ సలహా దారు వి.హనుమంత రావు, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్,ఎమ్మెల్యేలు బండారి లక్ష్మారెడ్డి, మల్‌రెడ్డి రంగా రెడ్డి, శ్రీ గణేశ్ హాజరయ్యారు.

Post a Comment

0 Comments

Close Menu