Ad Code

ముంబై మ్యూజిక్ కన్సర్ట్ లో అతిగా మద్యం తాగి ఒకరు వ్యక్తి మృతి : ఆసుపత్రి పాలైన మరో మహిళ

ముంబైలోని వర్లి ప్రాంతంలో జరిగిన ఒక సంగీత కచేరీ (మ్యూజిక్ కన్సర్ట్) లో విపరీతంగా మద్యం సేవించడం వల్ల ఒక వ్యక్తి మరణించగా, మరో మహిళ ఆసుపత్రి పాలైనట్లు తెలుస్తుంది. వీరిద్దరూ నిన్న రాత్రి వర్లిలోని ఎన్‌ఎస్‌సీఐ డోమ్‌లో జరిగిన 'క్లాంగ్‌కున్స్ట్లర్ ఆల్ నైట్ లాంగ్' మ్యూజిక్ ఈవెంట్‌కు హాజరయ్యారు. మహిం ప్రాంతానికి చెందిన వృషభ్ గాంగూర్డే (28) మరియు అతని మహిళా స్నేహితురాలు భారీగా మద్యం సేవించారని సమాచారం. జనాభాతో కిక్కిరిసిపోయిన ఆ వేదికపై వారిద్దరూ అకస్మాత్తుగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీనితో వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి చేరుకునే లోపే గాంగూర్డే మృతి చెందినట్లు పోలీసుల ప్రకటన పేర్కొంది. మహిళను తదుపరి వైద్య చికిత్స కోసం జస్లోక్ ఆసుపత్రికి తరలించారని, ప్రస్తుతం ఆమె పరిస్థితి స్థిరంగా ఉందని వారు తెలిపారు. తాను కేవలం మద్యం మరియు ఎనర్జీ డ్రింక్స్ మాత్రమే సేవించానని ఆమె పోలీసులకు తెలిపినట్లు సమాచారం. ప్రస్తుతానికి ఎటువంటి ఆధారాలు లేనందున ఈ ఘటనలో డ్రగ్స్ కోణాన్ని పోలీసులు తోసిపుచ్చారు. గాంగూర్డే మృతిపై విచారణ కొనసాగుతుండటంతో వేదిక వద్ద ఉన్న సీసీటీవీ కెమెరాలు మరియు ఇతర పరికరాలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Post a Comment

0 Comments

Close Menu