పశ్చిమ బెంగాల్కు చెందిన మయుక్ కుంద గచ్చిబౌలి సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఏ ఫైనాన్షియల్ ఎకనామిక్స్ చదువుతున్నాడు. వర్సిటీ ప్రాంగణంలో ఉన్న బఫెల్లో లేక్లో శవమై కనిపించాడు. విద్యార్ది మృతి సమాచారం తెలుసుకున్న తోటి విద్యార్థులు ఘటన స్థలానికి చేరుకొని మయుక్ మృతిపై ఆందోళన వ్యక్తం చేశారు. ఘటన స్థలంలో సూసైడ్ నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పి మయూక్ మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రెండు రోజుల క్రితం కొంతమంది విద్యార్థులతో జరిగిన గొడవపడ్డట్లు మనస్థాపం చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు తోటి విద్యార్థులు చెబుతున్నారు. సమాచారం తెలుసుకున్న గచ్చిబౌలి పోలీసులు మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
0 Comments