తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం గంగాపూర్లో అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తను ప్రియుడితో కలిసి ఓ మహిళ హతమార్చింది. ప్రియుడు, ఆమె కలిసి భర్తను చంపి జేసీబీతో గొయ్యి తీయించి మృతదేహాన్ని పూడ్చిపెట్టింది. అనంతరం భర్త కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో నిందితులు తొమ్మిది రోజుల తర్వాత నేరాన్ని ఒప్పుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేశారు.
0 Comments